తెలంగాణాలో రేపట్నుంచి స్కూల్స్ ప్రారంభం..

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రేపట్నుంచి పాఠశాలల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ తప్ప మిగతా అన్ని పాఠశాలలు అలాగే సంక్షేమ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతించడం జరిగింది.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఇష్టపడకపోతే యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేయడం జరిగింది.ఇక అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులను కూడా వారం రోజుల పాటు నిర్వహించుకోవచ్చునని తెలిపడం జరిగింది. కాగా పాఠశాలలో ఉన్నప్పుడు ఏ విద్యార్ధి అయినా సరే కరోనా వైరస్ బారినపడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వుండకూడదని.. ఒకవేళ కనుక అలా చేస్తే స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది.
అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు తెరవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో స్కూల్స్ ని ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఇక విద్యాసంస్థల ప్రారంభానికి సంబంధించి ప్రత్యేక చర్యలను చేపట్టకుండా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ పేర్కొనడం జరిగింది.జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) నివేదిక ప్రకారం సెప్టెంబరు నెల ఇంకా అక్టోబరు నెలల్లో కరోనా వైరస్ థర్డ్‌ వేవ్ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుందని అందుకే పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా వేయనందున ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది ప్రమాదకరంగా మారనుందని అభిప్రాయపడటం జరిగింది.ఇక అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ఈ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరుతూ.. దీనిలో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి ఇంకా విద్యాశాఖ డైరెక్టర్‌ అలాగే నిపుణుల సలహా కమిటీలను చేర్చడం జరిగింది. ఇక ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇంకా జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: