చంద్రబాబు అభివృద్ధి అదుర్స్.. తెగమెచ్చుకున్న బండి సంజయ్?
పీవీఎన్ మాధవ్ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాన్ని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో అటల్ జీ విగ్రహాలు ఏర్పాటు చేయడం గొప్ప చర్యని అన్నారు. అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం అద్భుతమని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.గతంలో రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం ఉండేదని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీ నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పరిశ్రమలు సెమీకండక్టర్ యూనిట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. సీఐఐ సమ్మిట్లో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ఘనత చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడిందని చెప్పారు.త్వరలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలో ప్రాజెక్టులు సాగుతున్నాయని విమర్శించారు. అటల్ జీ ఆదర్శాలు మోదీ నేతృత్వంలో కొనసాగుతున్నాయని చెప్పారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు