టెక్నాలజీ పెరిగిపోయింది.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్ తప్పదా?

ఇంటర్ నెట్ నుంచి జీపీఎస్ దాకా వాతావరణం అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికి శాటిలైట్లే కీలకం. ఇందుకే దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలో పంపుతూ ఉన్నారు. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని? అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? ఓ సారి తెలుసుకుంటే..

ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేది నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చచుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈవో), మీడియం ఎర్త్, ఆర్బిట్(ఎంఈవో), లో ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో). ఇందులో జీఈవో కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ ఉప గ్రహాలు చాలా తక్కువ.

భూమికి సుమారు 35768 కి.మీ. ఎత్తులో ఉండే కక్ష్య జీఈవో. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయోగించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈవోలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకే ప్రాతంపై ఫోకస్ చేస్తూ ప్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లు ఈ కక్ష్యలోనే ఉంచుతారు.

భూమిపై రెండు వేల కి.మీ. నుంచి మూడు వేల కి.మీ. ఉండే ప్రాంతాన్ని ఎంఈవో అంటారు. ఇది జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యలో తిరిగేలా చేస్తారు.  భూమిపైన కేవలం 150 కి.మీ. నుంచి 450 కి.మీ. మధ్య దూరం ఉండే ప్లేస్ ని ఎల్ఈవో అంటారు. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి.

ప్రస్తుతమున్న శాటిలైట్లు అత్యధికం స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్  సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలో స్టార్ లింక్ కోసం 6050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్ లోకి పంపినవి కావడం గమనార్హం. త్వరలో మరో 6000 శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: