కేసీఆర్పైనే చురకలు.. తుమ్మల విసుర్లు భలే భలే?
ఈ ప్రభుత్వం వచ్చాక నేటి వరకు 33.23 కోట్ల రూపాయల నిధులు నేత కార్మికులకు 10 శాతం యార్న్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుంచి విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. కొంత మంది మధ్యదళారులు పవర్ లూమ్ వస్త్రాను చేనేత వస్త్రాలుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని కేబినేట్ ఆమోదం లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం ద్వారా ఆ పథకానికి కూడా నిధుల విడుదల కాలేదని, ఆర్భాట ప్రచారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను మోసం చేసిందని మంత్రి తుమ్మల ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పద్దతి ప్రకారం అసలైన చేనేత కార్మికులకు లబ్ధి చేకురేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తుమ్మల ప్రస్తావించారు. మరమత్తులు, చేనేత మగ్గాల ఆధునీకరణకు కోసం 2024-25 సంవత్సరానికి బీసీ సంక్షేమ శాఖకు కేటాయించబడిన 400 కోట్ల రూపాయలు బడ్జెట్ వినియోగించుటకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. వివిధ శాఖల ద్వారా 255 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం రావడం జరిగిందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.