పవన్‌: బ్లేడ్లతో కోసేస్తున్నారు.. జడ్‌ కేటగీరీ ఇచ్చేయండ్రా?

పవన్ కల్యాణ్ పొలిటిషయన్ కంటే ముందు సూపర్ స్టార్. ఆయన చుట్టూ ఒక ప్రైవేట్ సైన్యం ఎప్పుడూ ఉంటుంది. ఆయన్ను కలవడం అంత సులభం కాదు. తెలుగు సినిమా రంగంలో ఆయన నంబర్ వన్ స్టార్ గా ఉన్నారు. ఆయనకు సినీ గ్లామర్ పుష్కలం. కానీ ఇప్పుడు ఆయన తనపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది.

పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఎన్నికల సమయంలోను ఇలాంటి ఆరోపణలే చేశారు. తన హత్యకు ప్లాన్ జరిగిందని.. సుఫారీ సైతం ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పిఠాపురంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా మరోసారి ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు ఆయన ఫిర్యాదు చేయవచ్చు కదా అని పలువురు పేర్కొంటున్నారు.

అయితే పవన్ పై సన్నని బ్లేడ్ తో దాడులకు తెగబడటానికి ముఠా సిద్ధంగా ఉందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ పవన్ పై దాడులు చేస్తారనే దానికి ఆధారాలు ఉన్నాయా. లేక ఇంటిలిజెన్స్ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా. ఉత్తమాటగానే అంటున్నారా అనేది తెలియరావడం లేదు. నిజంగా జరిగితే పవన్ ఆధారాలను కేంద్రానికి సమర్పించి తగిన సెక్యూరిటీని పొందాలి.

ఇదే విషయంపై లోకేశ్ కు కేంద్రం జెడ్ ప్లస్ సెక్యురిటీని కేటాయించింది. ఒకవేళ పవన్ అది చూసి అదే తరహా ఠీవీని తనకు కావాలని కోరుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు. జెడ్ ప్లస్ అంటే చుట్టూ కమెండోలు గన్లు పట్టుకొని నడుస్తుంటే ఆ  దర్జానే వేరని.. రాజకీయ నాయకులు కోరుకునేది కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ దాని కోసం ఇదంతా చేస్తున్నారా.. లేక అభిమానులు తాకిడి తట్టుకోలేక వారిని నియంత్రించేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారా..లేక నిజంగానై వైసీపీ దాడి చేసేందుకు యత్నిస్తోందా అనేది తెలియడం లేదు. ఈ విషయంలో పవన్ ఒక అడుగు ముందుకు వేసి ఫిర్యాదు చేస్తే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: