మోదీకి గుదిబండగా మారనున్న బాబు?

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు 2014 ఫలితాలు రిపీట్ చేస్తాయని అంతా భావిస్తున్నారు.   పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలకు టీడీపీ 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను కేటాయించింది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. పొత్తులో సింహ భాగం సీట్లు టీడీపీవే కాబట్టి కూటమిలో ఎక్కువ బాధ్యత ఆ పార్టీపైనే ఉంటుంది. ఆ పార్టీ మ్యానిఫెస్టో అసలైనదిగా భావించాలి.

అయితే టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. భారీ సంక్షేమ పథకాలతో మ్యానిఫెస్టోని ప్రకటించనుంది. ప్రజలకు భారీ హామీలు ఇవ్వనుంది. అయితే వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ విషయంలో బీజేపీ పై బాధ్యత వేయాలని చంద్రబాబు చూస్తున్నారు. టీడీపీ అధినేత ఇచ్చిన హామీలకు బీజేపీ అండగా నిలబడుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని చూస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ తీరుకోకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

టీడీపీ తాజాగా ప్రకటించిన రెండు హామీలు అమలు చేయాలంటేనే దాదాపు రూ.85 వేల కోట్లు అవసరం. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే జగన్ పథకాలను సైతం కొనసాగించి వాటికి మించి ఇస్తానని ప్రకటించారు. జగన్ ప్రకటించి పథకాలకు దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారు.

ఈ లెక్కన చంద్రబాబు పథకాలు అమలు చేయాలంటే దాదాపు రూ. లక్షా యాభై వేల కోట్లు కావాలి. అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. ఈ లెక్కం పథకాలకు బీజేపీ బాధ్యత తీసుకుంటుందా. ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మరి చంద్రబాబు ఇచ్చిన హామీలకు బీజేపీ కానీ. జనసేన కానీ బాధ్యత వహిస్తాయా అన్నది ఇప్పుడు ప్రశ్న. అలా బాధ్యత వహిస్తేనే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే 2014లో రెండు పార్టీలు హామీలిచ్చి ఆ తర్వాత విడిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాదని చంద్రబాబు ప్రకటించే హామీలకు బీజేపీ బాధ్యత వహిస్తేనే కూటమి విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: