పాక్‌, చైనా కోసం.. భారత్ భారీ ప్లాన్ రెడీ చేస్తోందా?

భారత ప్రభుత్వం ఏదో చేస్తోంది. రహస్యంగా ఏదో ప్రిపరేషన్ జరగుతోంది. అత్యవసరంగా రూ.85వేల కోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయుధాల కొనుగోలుకు రిలీజ్ చేసింది. అంటే ఏ దేశమైనా పాకిస్థాన్, చైనా భారత్ పై ఏమైనా దాడి చేయబోతున్నాయా ? అందుకోసమే భారత్ అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఒక వైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్థాన్ లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కానీ నవాజ్ షరీఫ్, భుట్టో వాళ్ల పార్టీ పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో సివిల్ వార్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు సైన్యం కూడా తిరుగుబాటు చేస్తుందనే ప్రచారం ఉంది.

పాక్ లో మరోవైపు ప్రజల తిరుగుబాటు కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిల్జిస్థాన్ , బెలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే పాలకులపై తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తాము కూడా కశ్మీర్ లో కలుస్తామని డిమాండ్ చేస్తున్నారు. బెలూచిస్తాన్, బాల్ధిస్తాన్ ప్రాంతంలో కూడా భారత్ లో కలవాలన్న ఆలోచన మొదలైంది. దీనిని అదునుగా భావించి చైనా, పాక్ చేతులు కలిపి పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు మన కశ్మీర్ ను కలుపుకోవాలన్న ఆలోచనతో ఏమైనా దాడులు చేయోచ్చేమో అందుకే భారత్ సైన్యం సిద్ధం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. కేంద్రం పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయుధాలు కొనుగోలు చేయడం, అదీ అత్యవసరంగా వెంటనే కొనడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ కోసమే కేంద్రం మరోసారి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎన్నికలకు ముందు సైన్యం కొన్ని యుద్ధాలు చేసింది. ఈ క్రమంలో మోదీ సర్కారు మరేదైనా ప్లాన్ చేస్తుందా అన్న చర్చ జరగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: