చంద్రబాబు ఉక్కు కౌగిలిలో పవన్‌..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇంకా సీట్ల సర్దుబాటు విషయం తేలలేదు. మరోవైపు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను తేల్చే పనిలో పడ్డారు. కానీ టీడీపీ, జనసేన మధ్య సీట్ల ప్రకటన రగడ జరుగుతుంది. చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు చేశారు కాబట్టి తాను కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తానని పవన్ రెండు పేర్లను చెప్పేశారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తుపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోతోంది. ఆయన భయపడ్డారని ప్రచారం జరుగుతుంది. రాజా నగరం, రాజోలు నుంచి జనసేన అభ్యర్థులు పోటీకి దిగుతారని పవన్ ప్రకటించారు. సీఎం పదవి షేరింగ్ పై లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సైతం పవన్ స్పందించారు.

అయినా సరే టీడీపీతో పొత్తు కొనసాగుతుందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని పవన్ తేల్చేశారు. అయినా సరే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. బోండా ఉమ మాత్రం ఇవి జనసేనకు ఇవ్వాల్సిన సీట్లేనని సమర్థించుకున్నారు. అయితే పవన్ పునరాలోచనలో పడ్డారని బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో అన్నది అందరిలో ప్రశ్న.

అయితే పవన్ ఇప్పటికిప్పుడు పవన్ బయటపడే మార్గాలు లేవు. ఒకవేళ జనసేనాని బయటకి వెళ్లినా చంద్రబాబుకి చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే షర్మిళ ఆయన డెరెక్షన్ లో పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. పవన్ వెళ్లిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట నడిచే అవకాశం ఉంది. మరోవైపు వామపక్షాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. టీడీపీతో కలిసి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.  కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నందున చంద్రబాబు వస్తానంటే తప్పుకుండా ఆహ్వానిస్తాయి. ఎలా చూసుకున్నా చంద్రబాబుకి మిత్రులు రెడీ గా ఉండటంతో ఆయన భయపడే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: