జగన్‌ స్టయిల్‌ డిఫరెంట్‌.. ఓట్లు కురిపిస్తుందా?

రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు రూ. 2 కిలోల బియ్యం, పేదలకు స్థలాలు ఇచ్చే స్కీంలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక పండగలకు ఇచ్చేవారు. కానీ మొత్తంగా ఎప్పుడు ఫ్రీగా ఇస్తే సోమరులుగా తయారవుతారని ఆయన అభిప్రాయపడేవారని తెలుస్తోంది. అందుకే పండగల సమయంలో మాత్రమే ఆయన కానుకలు ప్రకటించే వారు. వాటిని ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక మద్య పాన నిషేధం ఎత్తేశారు. బియ్యం ధరలు కూడా 5 రూపాయల వరకు కూడా చేశారు.


అయితే చంద్రబాబు విద్యా, వైద్య వ్యవస్థలో ఎక్కువగా కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించారు. ఇలా ప్రోత్సహించడం వల్ల అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవి ఎక్కువ రేటులో ఉండడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కార్పొరేట్ వ్యవస్థలో పేద ప్రజలకు కూడా వైద్యం అందేలా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తీసుకొచ్చారు.


విద్యా వ్యవస్థలో ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో ఇంజినీరింగ్ కాలేజీల్లో సామాన్య యువతకు ఇంజినీరింగ్ విద్య అందేలా చేశారు. తర్వాత అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు తీసుకు వచ్చారు. అయితే జగన్ సూత్రం పాలన కేంద్రీకరణ అనేది ఆయన వ్యుహం. అయితే సభలు సమావేశాలు పెట్టి పథకాల లబ్ధిదారులకు చేయూత నిచ్చే స్థాయి నుంచి పేదల ఇంటికే వెళ్లి డైరెక్టుగా ఇవ్వడం అనేది జగన్ అవలంబిస్తున్న సూత్రం


దానికే సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. ప్రతి పథకాన్ని ఇంటికి తీసుకురావడం రాకపోతే వచ్చేలా చేయడం వాలంటీర్ల పని. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య పాలన స్టైల్ ఒక రకంగా ఉంటే.. జగన్, కేసీఆర్ లది మరో స్టైల్. అయితే వరదలు వచ్చిన సమయంలో పూర్తిగా అధికారులను అప్రమత్తంగా ఉంచి వరదలు పోయాక జగన్ వెళ్లి పరామర్శిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: