హిందూయిజాన్ని విశ్వవ్యాప్తం చేసిన మోదీ?
దేశం అంటే పురాతన, సనాతన, హిందూ సంప్రదాయాలను తెలిపేలా ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేశమని చాటి చెప్పేలా చేశారు. దీన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మోదీ ఇండియాకు కూడా వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు వచ్చినపుడు అందరూ చూపించిన విధంగా తాజ్ మహాల్ కాకుండా ఇండస్ట్రీయల్ లో దేశం ఎలా మెరుగుపడింది. సనాతన హిందూ ఆలయాలు, దాని నిర్మాణాలు,భారతీయుల జీవన విధానం, వారు ఏళ్ల కింద ఎలా గడిపారనే వివరాలను వారికి తెలియజేస్తున్నారు.
దీంతో ఇప్పటి వరకు ఇండియా అంటే పేద దేశం అనుకునే వారు సైతం ఎప్పుడో ఎన్నో ఏళ్ల కిందటే చరక సంహిత లాంటి గ్రంథం ఉందని, చాణక్యుడి నీతి సూత్రాలు ఉన్నాయని, మనిషి అనారోగ్యానికి గురైతే ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకునే వారని తెలుసుకుంటున్నారు . ఇండియా అనేది పేద దేశం కాదని ఒకప్పుడు దేశంలో అన్ని రంగాల్లో నిష్ణాతులు ఉండేవారని చెప్పడంతో మోదీ సక్సెస్ అవుతున్నారు.
కానీ కాంగ్రెస్ హయాంలో ఇండియాకు ఎవరైనా ప్రజా ప్రతినిధులు వస్తే వారికి పాములు పట్టే వారిని చూపించే వారని, కొరడాలతో దెబ్బలు కొట్టుకునే వారిని చూపించే వారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మహా అయితే తాజ్ మహాల్ చూపించేవారు. కానీ ఇండియా అంటే తాజ్ మహాలే కాదు అంతకు మించి అని చెప్పడంలో ప్రధాని మోదీ విజయం సాధిస్తున్నారు.