ఆ విషయంలో భారత్‌ను చైనా లైట్‌గా తీసుకుంటోందా?

భారతదేశం ఎప్పుడూ తనకు తానుగా ఎవరి మీదకు గొడవలకు వెళ్లదు. తాను ఇంత బలవంతుణ్ణి, అంత బలవంతుణ్ణి అంటూ  పక్క దేశంపై తన బలాన్ని ప్రదర్శించదు. చివరికి పాకిస్తాన్ పై కూడా  భారత్ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. మనం మామూలుగా ఎవరి జోలికీ వెళ్ళం. ఎవరైనా మన జోలికి వస్తే వదిలిపెట్టం. ఇది భారత్ నైజం. చైనా విషయంలో కూడా అంతే చైనా ని ఎప్పుడు మనపై దాడి చేసి ఆక్రమించుకునేది.


కానీ మనం ఎప్పుడూ చైనా పైకి ఆక్రమణలకు వెళ్లలేదని తెలుస్తుంది. గాల్వాన్ లోయ దగ్గర, తవాంగ్ దగ్గర ఉన్న బఫర్ జోన్లను ఆక్రమించింది చైనా. మన రక్షణలో ఉన్న భూటాన్ లోని డోక్లాం దగ్గర వ్యవహారాలు నడిపితేనే మనం రిట్రాక్ట్ ఇచ్చాం అని తెలుస్తుంది. అయితే చైనా వాడు భారత్ ను అసలు మేము లెక్కే చేయమని చెప్తున్నాడట.


భారత్ ను మేము అసలు లెక్కే చేయమని చైనీస్ ఎక్స్పర్ట్స్ పేరుతో  పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ  తరపున చేసిన ప్రకటన ఏంటి అంటే భారత్ మాకు అసలు చాలెంజ్ కాదు అని చెప్పడం జరిగిందట. ఈ మాట చెప్పిన వాళ్ళు జావ్ షి యు జు, ఝాన్సీ వీళ్లిద్దరూ కూడా చైనాకు సంబంధించిన సీనియర్ కల్నల్స్. చైనాకు సంబంధించిన యూనివర్సిటీలో ఈ సైన్యాన్ని తయారు చేసేటటువంటి విభాగాలకు సంబంధించిన వాళ్ళు.


షాంగుల డైలాగ్ సింగపూర్ లో జరుగుతున్నటువంటి దానిలో ప్రసంగిస్తూ మీ మద్దతు పైన స్థితిలో ఉన్నాం భారత్ కు అంత సీన్ లేదని అన్నారని తెలుస్తుంది. వార్ ప్రిపేర్ నెస్ లో, మోడర్నైజేషన్లో ఇన్ఫ్రా లో, స్పీడ్ లో, ట్రైనింగ్ లో భారత్ కు ఎటువంటి అనుభవం లేదని అనే విషయాన్ని ప్రకటించారట. అయితే వీళ్ళకి తెలియని  విషయం ఏమిటంటే చైనా దేశం ఎప్పుడో ఒకసారి మనతో యుద్ధం చేసింది‌. కానీ భారత్ మాత్రం అనేకసార్లు యుద్ధాలు చేసిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: