చైనాలో ముస్లింల పరిస్థితి ఇంత దారుణమా?

ఇప్పుడు  అమెరికా, యూరప్ దేశాలు భారతదేశంలోని ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ అని తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే మహమ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు అనుచితం అంటూ ఆయా దేశాలు ఆ విధంగా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఆమె పై ఇప్పుడు ఆ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ముస్లింలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసింది అని వీళ్ళందరూ ఇలా ప్రతిస్పందిస్తున్నారు బాగానే ఉంది. కానీ వీళ్లు ఎవరూ భారతదేశంపై దాడి చేయలేదా? గతంలో వీళ్ళు ఎప్పుడూ  ఎక్కడా ఎవర్నీ హత్యలు చేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. భారతదేశం ముస్లింలపై విచక్షణ చూపిస్తుందంటూ అగ్ర దేశాలైన అమెరికా, యూరప్ ఇంకా చైనా దేశాలు అన్ని ఈ విషయంపై ఏకతాటిపైకి వచ్చి భారత్ ను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

భారత్ పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భారతదేశం ముస్లింలపై వివక్ష చూపిస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న చైనా దేశంలో మాత్రం  దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. చైనాలో ఇప్పటికీ హిజాబ్ ధరించడానికి వీల్లేదు. బురఖా ధరించడానికి కూడా వీల్లేదు. ఇంకా అక్కడ అనేక మసీదులు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అక్కడ.  అక్కడ మదర్సాలు కూడా లేవు చివరికి పాత మసీదులను కూడా కూలగొట్టి మరీ కమ్యూనిస్టు కార్యాలయాల్లా ఇంకా పాఠశాలలుగా మార్చేస్తున్నారు.

వీగర్లు అయితే అక్కడ మత ప్రార్థనలు చేయడానికి కూడా వీలు లేదట అక్కడ ఎక్కడా కూడా. అయితే ఇప్పుడు అక్కడ మసీదులు కూల్చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ‌ కమ్యూనిటీ ప్రజలు ఆశ్చర్యపడే విధంగా తిరగబడ్డారట. నినాదాలు చేసి మరీ ఉద్యమాలు చేస్తున్నారట. చైనా చరిత్రలో ఒక కమ్యూనిటీ ఈ విధంగా ప్రభుత్వం పై తిరగబడటం ఇదే ప్రథమం అని అంటున్నారు. అయితే ఒక్క ముస్లిం దేశం కూడా దీనిపై స్పందించలేదని తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: