పవన్‌ కు అండగా మెగా క్యాంపస్‌.. సూపర్‌ సీన్‌ ?

పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలపై బాగా దృష్టి పెడుతున్నారు. త్వరలోనే రాష్ట్ర మంతా పర్యటించబోతున్నారు. దీనికి యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయ్యింది. దసరా నుంచి ఈ పర్యటన ఉంటుంది. అయితే.. ఇలాంటి పర్యటన అంటే మాటలు కాదు.. అందులోనూ రాష్ట్రమంతా తిరగాలి.. నాయకులు, అభిమానుల హడావిడి.. దానికో పెద్ద టీమ్ ఉండాలి. మరి ఇదంతా మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చే అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ సమయంలో మెగా క్యాంపస్ పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచింది.

అంతే కాదు.. పవన్ ఇటీవల కౌలు రైతుల భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తున్నారు. అందుకే వీటన్నిటికీ కలిపి.. మెగా క్యాంపస్‌ నటులు పవన్ కల్యాణ్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అందుకు ప్రారంభంగా అన్నట్టు కౌలురైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి మెగా క్యాంపస్‌ రూ.35 లక్షల విరాళం ప్రకటించింది.

పవన్‌ రూపొందించిన ఈ ప్రత్యేక నిధికి పవన్ కల్యాణ్‌ కుటుంబసభ్యులు విరాళం ఇచ్చారు.  వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిహారిక.. ఇలా వీరంతా కలిసిన తాజాగ పవన్‌ను కల్యాణ్‌ను కలిసి రూ. 35 లక్షల రూపాయలకు చెక్కులు అందించారు. ఈ విరాళంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. జనసేన కార్యకర్తలు అంటే అందులో కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మెగాస్టార్ అభిమానులు, మెగా క్యాంపస్ అభిమానులు కూడా ఉంటారు కదా.

ఇప్పుడు పవన్ కల్యాణ్‌ వెనుక ఇలా కుటుంబమంతా అండగా నిలబడిన సీన్.. చూస్తే అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇక ఇప్పుడు మెగా క్యాంపస్ నటులు కూడా నీ వెంటే మేమున్నామని ఈ విరాళంతో చెప్పకనే చెప్పేశారు. మంచి పరిణామమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: