అసలేం జరిగింది? : ఒక్క గ్రూప్ 1.. ఎన్నో ప్రశ్నలు?
వారు ఏమంటున్నారంటే.. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలెలా మారతాయి..? జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణం ఏమిటి..? అధికారులు మారిన తర్వాత ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. 202 మందిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారని గ్రూప్-1 అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు.
గతంలో సిద్దం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు.. 55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారని ప్రశ్నిస్తున్నారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని గ్రూప్-1 అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఈ ఫలితాలు నిలిపేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని గ్రూప్-1 అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో సీతారామాంజనేయులు ఉన్న సమయంలో రూల్ ప్రకారం జరిగిందని.. కొత్త అధికారులు వచ్చాక కొత్త వారిని ఎంపిక చేశారని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. డిజిటల్ ఇవాల్యూషనులో అంతా పారదర్శకతగానే జరిగిందంటున్న గ్రూప్-1 అభ్యర్థులు.. ఇప్పుడు అభ్యర్థులనే మార్చి మాకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. అర్హత లేనివారిని అడ్డ దారుల్లో ఎంపిక చేస్తున్నారని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సీబీఐతో విచారణ చేయించి 202 మందికి న్యాయం చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరుతున్నారు. తమ వాదనలు విన్న గవర్నర్.. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. మరి చివరకు ఏం చేస్తారో..?