శభాష్ పవన్: చాలా మంచి పని చేస్తున్నావ్?
అయినా సరే. పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా అలాంటి నిర్ణయం కౌలు రైతుల విషయంలో తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున జనసేన ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకు తనవంతు గా రూ.5 కోట్లు సాయం అందించారు. మనకు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ఆవేదన కలిగించిందని పవన్ కల్యాణ్ అంటుంటారు.
అందు కోసమే కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తాజాగా మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో వివరించారు. ఈనెల 12న అనంతపురం జిల్లా నుంచి పవన్ కల్యాణ్... జనసేన రైతు భరోసా యాత్ర ప్రారంభించబోతున్నారు. నిజంగా ఇది మంచి నిర్ణయం.. నిజంగానే కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కాదు.. ఎందుకంటే.. సాధారణంగా రైతు ఏదైనా ప్రకృతి విపత్తువల్లో.. మరేదైనా కారణంతోనో పంట కోల్పోతే.. అతన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది.
కానీ.. కౌలు రైతు సంగతి అలా కాదు.. కౌలు రైతు రికార్డుల్లో ఉండడు..కానీ ఏపీలో కౌలు రైతులే ఎక్కువ. వారికి ఎలాంటి సాయం అందదు.. పంట చేతికి రాకపోతే.. ఇక రైతులు ఆత్మహత్యే శరణ్యం అన్నట్టుగా ఉంటుంది వారి పరిస్థితి.. ఇలాంటి వారి సమస్యను పవన్ కల్యాణ్ టేకప్ చేయడం ఆహ్వానించతగ్గ పరిణామం.. మరి పవన్ కల్యాణ్ టేకప్ చేశాకైనా జగన్ సర్కారు ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూద్దాం.