మళ్లీ విజయసాయి యాక్టివ్‌ కాబోతున్నారా?

విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సీపీలో గతంలో చాలా ఇంపార్టెంట్ రోలు పోషించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి  రాకతో పక్కకు వెళ్ళవలసి వచ్చిందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కారణాలవల్ల మళ్లీ వైయస్సార్సీపి కేడర్లో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తుందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా దీని మీదే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్ సాయి రెడ్డి రాజ్యసభలో ఫ్లోర్ లీడర్, అలాగే పార్లమెంట్ మెంబర్ కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు హెడ్ గా, కన్వీనర్ గా పనిచేసే వారు ఆయన. గతంలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా పని చేశారు. కానీ అక్కడ ఎమ్మెల్సీ ఓటమితో వైవి సుబ్బారెడ్డి ఆయనకు బదులుగా తెరపైకి వచ్చారు అప్పుడు.

అయితే ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి జగన్ కి భారమవ్వడంతో ఇప్పుడు మళ్లీ విజయ్ సాయి రెడ్డి పేరు వినిపిస్తుందని తెలుస్తుంది. మరి వై వి సుబ్బారెడ్డి విషయంలో అసలు జగన్ కి సమస్య ఏంటి అంటే, బాలినేని తో వివాదం అని తెలుస్తుంది. దాంతో బాలినేని కన్వీనర్ పదవి నుండి అలిగి పక్కకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. దాంతో మళ్లీ విజయ సాయి రెడ్డికి ఘనమైన స్వాగతం పలకబోతుంది వైయస్సార్ సిపి అని వాట్సాప్ గ్రూపు లో న్యూస్ వైరల్ అవుతుంది.

కానీ ఇక్కడ వినపడే మరో విషయం ఏమిటంటే, ఆయన్ని బాలినేని వదిలేసిన ప్లేస్ లో ఇంచార్జిగా నియమించబోతున్నారని తెలుస్తుంది. విజయ్ సాయి రెడ్డి పార్టీ ఆక్టివిటీస్ కు దూరమైన తర్వాత కేంద్రానికి సంబంధించి, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన ప్రెస్ మీట్ లకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన తిరిగి వైఎస్ఆర్సిపి లోకి వస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వస్తుంది. దీనిపై విజయ సాయిరెడ్డి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: