హిందువుల పండుగల్లో హింస.. ఎందుకలాగ?

ఎవరికైనా మతపరమైన అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం ముదిరి పాకాన పడకూడదు. దానివల్ల ఎటువంటి విద్వేషాలు చెలరేగకూడదు. వాస్తవంగా బక్రీదుకు ఒకచోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. రంజాన్ కూడా ఒక చోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ క్రమంగా అందులోని కొంతమంది పెద్దలు కావాలని ఆ కార్యక్రమాలను విస్తరిస్తూ రోడ్లమీద, రైల్వే స్టేషన్ లో, బస్టాండ్లో కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈఫిల్ టవర్ దగ్గర కూడా చేసింది మనం గమనించం.

 ఇదివరకు వాళ్ళు ఇలా చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే ఎవరు ఆపుతారో చూద్దామని, మన ఓట్లు వాళ్ళకి కావాలి కదా అనే ఉద్దేశంతో దాని వెనకాల మళ్ళీ ఒక పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటుందని, అలా సైకలాజికల్ గేమ్ ని వాళ్ళ చేసుకుంటూ వస్తున్నారని కొంతమంది సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీరామనవమి లాంటి పండుగలు కూడా గుడిలోనే ఉండి చేస్తూ ఉంటారు. మహా అయితే బయట ఊరేగింపులు చేస్తూ ఉంటారు‌. కానీ ప్రత్యేకించి శోభాయాత్ర లాంటివి గతంలో జరిగేవి కావు.  మొన్న శ్రీరామనవమి, ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇండియాలో శోభాయాత్రలు మొదలైనట్టే అనుకోవాలి. అక్కడ తాము చేసుకుంటూ వచ్చిన దాన్ని వాళ్లు సమర్థించుకుంటూ వచ్చి, ఇప్పుడు దీన్ని అంగీకరించట్లేదు. దాని పర్యవసనమే గత వారం గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు బీహార్‌లలో రామనవమి సందర్భంగా హింస చెలరేగింది.

ఇప్పుడు దేశమంతా శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా ముందు ఒక వారం రోజులు వెనక ఒక వారం రోజులు తేదీలు పెట్టుకొని మరి జరుపుతున్న సందర్భంగా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఇమ్మీడియేట్ గా జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రాలు ప్రిపేర్ గా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా చెప్పుకొచ్చింది. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఏ అంశాన్నైనా పర్యవేక్షించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: