సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న ప్రచారం?
నెక్స్ట్ స్టేజ్ లో యూట్యూబ్, ఇన్ స్టా గ్రాం, రీల్స్ చేసే అమ్మాయిలు, లేదా సెలబ్రెటీలుగా ఇమేజ్ సాధించుకున్న వారిని ఐడెంటీపై చేసి వారికి మెయిల్ ద్వారా మేసేజ్ పంపిస్తారు. మా కంపెనీకి చెందిన చీర పంపిస్తాం. ఇది మీరు ఉంచుకుని మాకు అడ్వర్టజ్ మెంట్ చేయండి. వంటలు చేసే వారికైతే మీకు రైస్ కుక్కర్, లేదా వంటపాత్రలు మీవే.. మాకు ఈ రీల్ చేసి పెట్టండని బడా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గాలను వెతుక్కుంటున్నాయి.
పత్రికలు చదివే వారు వార్తలు ఎక్కువగా చూస్తారు. ప్రకటనలు చూడరు. టీవీలో ఫలానా సీరియల్ వచ్చే సమయంలో మాత్రమే అడ్వర్టజ్ మెంట్లు చూస్తారు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారు తాము చేసిన దాన్ని సోషల్ ప్రపంచానికి విడుదల చేస్తుంటారు. దీనితో ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. దీంట్లో ప్రస్తుతం పెడధోరణులు వస్తున్నాయి. మన వ్యాపారం గురించి మంచి చెప్పడమే కాకుండా ఎదుటి బ్రాండ్ల గురించి చెడుగా చెప్పించడం అలవాటై పోయిందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకు తలనొప్పిగా మారుతోంది. దీంతో బడా కార్పొరేట్ బాబులు తమ ప్రొడక్టు గురించి నెగటివ్ చెప్పమని వస్తే చెప్పకండి.. అలాంటి సమాచారం మీ వద్ద ఉంటే మాకు ముందుగా తెలియజేయండి మీకు సరైన డబ్బులు ఇస్తామని ప్రాధేయపడుతున్నారు.