చమురు దందా.. అమెరికా నాటకం బయటపడిందా?

రష్యా‌ ఇతర దేశాలకి ఆయిల్ ని సప్లై చేసే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారానే జర్మనీ, యూరప్ దేశాలకు అది ఆయిల్ ని సప్లై చేసేది. అది దాని నార్డ్ స్ట్రీమ్ 1, 2 పైప్ లైన్ ని తానే ధ్వంసం చేసుకుంది అని ముందు నాటకం ఆడింది అమెరికా. కానీ అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ గత వారం బయట పెట్టిన బాంబు లాంటి నివేదిక ప్రకారం, జో బైడెన్ ఆర్డర్‌ల ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్‌లో గ్యాస్ పైప్‌లైన్‌లపై యునైటెడ్ స్టేట్స్ డ్రైవర్లు బాంబు దాడి చేశారని, అలానే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ జర్మనీని కూడా స్తంభింపజేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

బెర్లియార్ గిట్లియన్, ఇంకా సెమోర్ క్రష్ ఒక  ఇంటర్వ్యూలో వివరించిన దాని ప్రకారం  ఉక్రెయిన్ లో నెలకొన్న సంఘర్షణ ప్రభావం పశ్చిమ దేశాలపై కూడా పడడంతో, వాషింగ్టన్ తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని, అమెరికా అధ్యక్షుడు, జర్మనీ ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా దానిని స్తంభింపజేయడానికి చూస్తున్నారని ఆయన చెప్పాడు. జర్మనీ బహుశా అందుకే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం మానేసింది.

ఇంతలో రష్యా, పశ్చిమ ఐరోపాకు అనుసంధానించబడిన నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌ల ధ్వంసం వెనుక యునైటెడ్ స్టేట్స్ లేదని నిరూపించడానికి ప్రయత్నించాలని రష్యా డిమాండ్ చేసింది. జర్మనీని కూడా దెబ్బతీయడానికి అమెరికా కుట్ర పన్నిందనే విషయం ఇక్కడ అత్యవసర కీలకమైన విషయం.

మనం రష్యా నుండి ఆయిల్ ను తీసుకుని, శుద్ధి చేసి అమెరికా, యూరప్ దేశాలకు అమ్ముతున్నాం, ప్రస్తుతానికి అమెరికా కొంటున్నది. కానీ వారి అవసరం తీరిపోయాక మన మీద కూడా కుట్ర చేస్తారు. ఇప్పటికే మనతో సహకరించినట్టు ఉంటూనే,  బి బి సి ద్వారా కుట్ర పన్నుతున్నట్టే జర్మనీ మీద కూడా అమెరికా కుట్ర పన్నుతున్న విషయం బయటపడింది. వెనక దాడులు, దొంగ కుట్రలు  అమెరికా చేస్తుందని అన్ని దేశాలకు తెలిసినట్టుగానే, అమెరికాకు అది వెన్నతో పెట్టిన విద్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA

సంబంధిత వార్తలు: