ఆంధ్రజ్యోతిపై వైఎస్‌ సర్కారు న్యాయపోరాటం?

Chakravarthi Kalyan
సీఎం జగన్ సచివాలయాన్ని తాకట్టు పెట్టారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని కుప్పగా మార్చిన జగన్… చివరికి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి రూ.370 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి సీఎం చంద్రబాబు రూ.700 కోట్లతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు.

రాష్ట్ర బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. కానీ కేవలం రూ.370 కోట్ల రుణం కోసం తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలపై సీఆర్ డీఏ స్పందించింది. సీఎం జగన్ సచివాలయం తాకట్టు పెట్టి రుణం పొందారన్న వార్తలను సీఆర్డీఏ ఖండించింది. ఇదంతా పూర్తి అవాస్తవం అని, సాధారణ పరిపాలన శాఖ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేసింది.

కన్సార్టియం బ్యాంకులు, హడ్కోలు నుంచి సీఆర్డీయే పొందిన రుణం  మౌలక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాం. సచివాలయం తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త అవాస్తవం. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేస్తాం అని హెచ్చరించింది. రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారులు క్వార్టర్ జీవోఎంఎస్ నంబరు 332, ప్రకారం రూ.2,060 కోట్లు రుణాన్ని కన్సార్టియం బ్యాంకులు అయిన యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లు మంజూరు చేశాయి.

ఇందులో రూ.1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీయేకు రిలీజ్ చేశాం. 2017లో హడ్కో రూ.1275 కోట్లకు మౌలిక సదుపాయాల కోసం రుణాన్ని మంజూరు చేసింది. అందులో రూ.1151 కోట్లు సీఆర్డీయేకి రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేసింది. ఏపీ సీఆర్డీయే సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణం పొందలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: