బాలికకు ముద్దు పెట్టిన టీచర్.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా మంచి వాళ్ళ ముసుగులో కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏకంగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాళ్లలోని మృగాలు బయటికి వచ్చి దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. అయితే ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకు ఇలాంటి వేధింపులు తప్పడం లేదు.

 సాధారణంగా స్కూలుకు వెళ్లిన విద్యార్థులకు ఇలాంటి వేధింపులు ఎదురైతే ఏకంగా టీచర్లకు జరిగిన విషయం చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ టీచర్లే కామాంధులుగా మారిపోయి కన్న బిడ్డల్లా చూసుకోవలసిన విద్యార్థులపై కామపు కోరలు విసిరితే.. ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతూ ఉంటారు విద్యార్థులు. అయితే ఇలా టీచర్లే కామాంధులుగా మారి విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.  గుజరాత్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.

 సూరత్ లో ఓం ప్రకాష్ యాదవ్ అనే టీచర్ తన దగ్గర చదువుకుంటున్న 13 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏకంగా బాలికను ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా తాకాడు. ఈ క్రమంలోనే ఇలా బాలికను ముద్దు పెట్టుకున్నందుకు జైలు పాలు అయ్యాడు. 2018లో ఈ ఘటన జరిగింది. బాలికను స్టాఫ్ రూమ్ లోకి పిలిచి తలుపులు మూసి ఆమెపై లాంగిక దాడి చేశాడు టీచర్. బాలిక ఫిర్యాదుతో టీచర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. బడిలో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులతో సమానమని చెప్పిన కోర్టు ఆ టీచర్కు రూ. 9,000 జరిమానాలతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: