పునాది తవ్వుతుండగా వింత శబ్దం.. ఏంటా అని చెక్ చేసి కూలీలు షాక్?
ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు భూమిని చదును చేస్తున్న సమయంలో వారికి వింత శబ్దం ఒకటి వినిపించింది. దీంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. అక్కడ ఉన్నది ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి వారిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే శబ్దం వినిపించిన చోట తవ్వడం మొదలుపెట్టారు. చివరికి బయటపడింది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు కూలీలు. ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే కొంతమంది కూలీలను పిలిపించి భూమిని చదును చేయాలని చెప్పాడు.
ఇక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు గుంతలు తవ్వటం మొదలు పెట్టారు. ఆ సమయంలో వారికి భూమిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. అక్కడ ఏం ఉండి ఉంటుందా అని కూలీలు మరింత జోరుగా తవ్వడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ బయటపడిన వస్తువులు చూసి ఒక్క సారిగా కూలీల కళ్ళు జిగేల్ మన్నాయి అని చెప్పాలి. సుమారు రెండు వేల ఏళ్ళనాటి ప్రాచీన మట్టిపాత్ర కనిపించిం.ది దానితోపాటు ఒక ఇనుప గొడ్డలి కూడా బయటపడింది. వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకుని ఇలా బయటపడిన పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.