మరో ఖైదీ పై అత్యాచారయత్నం..చివరికి..
వివరాల్లొకి వెళితే..ముంబయిలోని అర్ధర్ రోడ్ జైలులో ఓ వినూత్నమైన కేసు నమోదు చేశారు. ఓ మగ ఖైదీ తోటి మరో పురుష ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు..ఈ ఘటన దక్షిణ ముంబైలోని ఆర్థర్ జైలులో మే 14న జరిగింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బాధితుడు ఈ విషయాన్ని అధికారులకు చెప్పాడు. 20 ఏళ్ల ఖైదీ జకీర్ షా పై ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అత్యంత భద్రతతో కూడిన జైలులోని బ్యారక్ 7లో నిందితుడు అసహజ రీతిలో మరో తోటి ఖైదీపై ఈ నేరానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన ప్యాంటు విప్పి, మరో ఖైదీని బలవంతం చేశాడని తెలిపారు. అందుకు అతను గట్టిగా నిరాకరించగా, బలవంతంగా లైంగిక ప్రక్రియ చేశాడని అన్నారు.
ఈ కేసులో ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, ''ఈ సంఘటన గురించి మాకు ఒకరోజు ఆలస్యంగా తెలిసింది. మాకు ఆర్థర్ రోడ్ జైలులోని జైలర్ నుండి కాల్ వచ్చింది. నిందితుడు తన ప్యాంటు విప్పి ఇతర ఖైదీని బలవంతం చేశాడని చెప్పాడు. అయితే బాధితుడు దానిని వ్యతిరేకించాడు. కానీ, బలవంతంగా నిందితుడు తన కోరిక తీర్చుకున్నాడు. బాధితుడు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి అధికారులు ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ మాకు సమాచారం అందించారు.అతని పై కేసు నమోదు చేశారు.ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.