వంట బాలేదన్న భర్త.. చివరికి ప్రాణం పోయింది?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వంటలు రుచిగా తయారు చేయడం లేదనీ బట్టలు సరిగా ఉతకడం లేదు అంటూ భర్త భార్యను తిట్టడం మొదలుపెట్టాడు. ఇక రోజురోజుకీ వేధింపులు ఎక్కువవడంతో మనస్థాపం చెందిన భార్య చివరికి బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించిన ఈ ఘటన కరీంనగర్ లోని మెట్పల్లి లో వెలుగులోకి వచ్చింది. గాజుల పేటకు చెందిన ఫర్హానా బేగం నిజామాబాద్కు చెందిన వాజీద్దాన్ తో 2016 లో పెళ్లి జరిగింది.ఇక ఇటీవల మెట్పల్లి కి వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు ఈ దంపతులు. వీరికి సంవత్సరంన్నర కూతురు కూడా ఉంది.
అయితే గత కొంత కాలం నుంచి భర్త సూటిపోటి మాటలతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు.వంటలు రుచిగా చేయడం లేదని బట్టలు కూడా సరిగ్గా ఉతకడం లేదు అంటూ సూటిపోటి మాటలు అంటూ తిడుతూ ఉండేవాడు. ఇక భర్త ఎన్ని తిట్టినా భరిస్తూ వచ్చింది భార్య. రోజురోజుకి భర్త నుంచి వేధింపులు ఎక్కువవడంతో మనస్తాపం చెందింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన వాజీద్దాన్ తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో చివరికి తమకు చావే శరణ్యమని భావించింది. చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరికి మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.