దారుణం : ప్రియుడి దాష్టికం.. యువతి ప్రవేట్ పార్ట్ లో మిరపకాయలు పెట్టి?

praveen
ఇటీవల కాలంలో ప్రేమ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది . ఎంతోమంది కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అవసరాలు తీరిన తర్వాత అప్పటి వరకు నువ్వే ప్రాణం అంటూ చెప్పిన ప్రేమికులు చివరికి ప్రేమించిన వారిని నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నావు. ఇలా ఇటీవల కాలంలో ప్రేమికుల మధ్య బ్రేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ మరి కొంత మంది మాత్రం ప్రేమ అనే ముసుగులో మరిన్ని దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి.

 ప్రేమ పేరుతో మంచివాళ్లం అనే ముసుగు వేసుకుంటున్న ఎంతోమంది..  సమయం వచ్చినప్పుడు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేదంటే పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఒత్తిడి చేసిందంటే దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు కూడా తెరమీదకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి .ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. నువ్వే ప్రాణం అంటూ ఒక  యువతి వెంట పడ్డ యువకుడు ఆమె ప్రేమను అంగీకరించిన కొన్నాళ్లకే నిజస్వరూపాన్ని బయట పెట్టాడు

 అమ్మాయి పై దారుణంగా అత్యాచారం చేయడమె కాదు చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటన సూరత్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నీకుంజ్ అనే వ్యక్తి ప్రియురాలి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు ప్రైవేట్ పార్ట్ లో మిరపకాయలు దూర్చి దారుణంగా హింసించాడు. అయితే అతని నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళ ఆసుపత్రిలో చేరింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సదరు వ్యక్తికి అప్పటికే వివాహం జరిగింది అన్న విషయం పోలీసు విచారణలో తేలింది. పెళ్లయిన విషయం తెలిసి యువతి అతని దూరం పెట్టడంతో ఇక ఇలా చిత్రహింసలకు పాల్పడ్డాడట ఆ నీచుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: