పెళ్ళైన ఏడాదికే యాక్సిడెంట్.. 31 ఏళ్ళు కోమాలో.. చివరికి?
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా సినిమాల్లో ఒక వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు కోమాలోకి వెళ్లి ఆ తర్వాత దశాబ్దాల పాటు కోమలోనే ఉండి.. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత కోమా నుంచి బయటకు రావడం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి చూసినప్పుడు నిజ జీవితంలో మాత్రం ఇలాంటి తరహా ఘటనలు జరగడం దాదాపు అసాధ్యమని అనుకుంటారు అందరూ. కానీ ఇటలీలో ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆ యువతీ ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లిపోయింది. దాదాపు 31 ఏళ్ల పాటు కోమలోనే ఉన్న సదరు మహిళ చివరికి ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన ఇటలీలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మిరియం మినిస్ట అనే మహిళ ఏకంగా 31 ఏళ్లపాటు కోమాలో ఉండి చివరికి ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు స్తంభానికి ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో మిరియం తీవ్రంగా గాయపడింది. తలకి బలంగా గాయం కావడంతో కోమాలోకి వెళ్ళింది. అయితే అంతకు ముందు ఏడాదే ఆమెకు వివాహం జరిగింది అని చెప్పాలి. ఆమె మరణం పై స్పందించిన భర్త ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇప్పటికైనా ఆమెకు ప్రశాంతత చేకూరింది అంటూ చెప్పుకొచ్చాడు.