సొంత అన్నే కదా అని నమ్మితే.. బైక్ పై వెళ్తుండగా?

praveen
నేటి రోజుల్లో మనీకి ఇస్తున్న వ్యాల్యూ ని అటు బంధాలకు బంధుత్వాలకు ఇవ్వడం లేదు మనుషులు. విరసి పరాయి వ్యక్తుల విషయంలో కాదు ఏకంగా సొంత వారి విషయంలోనే ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా తమ్ముడిని చంపి ఆస్తి మొత్తం కాజేయాలని నీచమైన ఆలోచన చేశాడు అన్న ఏకంగా పేపర్ కట్టర్ తో తమ్ముడి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.

 చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబర్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన అశోక్ ఇద్దరు భార్యలు ఆయనకు ఓల్డ్ మలక్పేట్ లో పిండి గిర్ని ఉంది. మొదటి భార్య సుమతి కుమారుడు మల్లేష్ తన భార్య పిల్లలతో కలిసి కొన్నాళ్లపాటు ఉప్పల్ లో ఉన్నాడు. చెడు అలవాట్లకు బానిసగా మారిపోయాడు. దీంతో అప్పులు చేయడం నిత్య కృత్యంగా మారింది. అయితే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఎక్కువ అవ్వడంతో అంబర్పేట్ లోని ఇంటికి చేరుకున్నాడు. అయితే మొదటి అంతస్తులో మల్లేష్ నివసిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో అశోక్ రెండో భార్య అతని కుమారుడు నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.

 అయితే తన అప్పులు తీర్చుకోవడం కోసం ఇంటిని అమ్మేయాలి అంటూ తండ్రితో పాటు తమ్ముడు నవీన్ పై ఒత్తిడి చేశాడు మల్లేష్. ఇక ఇదే విషయంపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులు.. తనకు 50 లక్షలు ఇచ్చి మిగతా ఇద్దరు సోదరులు సమానంగా పంచుకోవాలని తన సూచించాడు. అయితే మల్లేష్ మాత్రం నీచంగా ఆలోచించాడు. తమ్ముడి అడ్డు తొలగించుకుంటే మొత్తం ఆస్తి తనకే వస్తుందని అత్యాశకు పోయాడు. ఇటీవల నవీన్ తన అన్న మల్లేష్ ని బైక్ పై కూర్చోబెట్టుకుని బయలుదేరగా.. ఇక మల్లేష్ వెనుక నుంచి తమ్ముడు గొంతు కోసిన హత్య చేశాడు. పోలీస్ విచారణలో నిజం ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: