పేరెంట్స్ ఇష్టంలేని పెళ్లి చేశారని.. షాక్ ఇచ్చిన కూతురు?
వెరసి కొన్నాళ్లపాటు బాధను మనసులో దాచుకుని కుమిలిపోయిన వారు ఆ తర్వాత ఇక ఈ జీవితం వృధా అని భావించి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇలా తల్లిదండ్రులు ఒత్తిడి చేసి ఇష్టం లేని పెళ్లి చేశారు అని కారణంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆనందంగా పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు మరికొన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి.
ఇలా కొంతమందికి పెళ్లి స్వీట్ మెమోరీస్ మిగిలిస్తే మరి కొంతమందికి మాత్రం విషాదాన్ని మిగులుస్తుంది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వెలుగుచూసింది. శాంతి నగర్ కాలనీకి చెందిన శారదకు గోసంగి శ్యామ్సుందర్ తో ఐదు నెలల క్రితం పెళ్లి జరిగింది. శారదకు ఇష్టంలేని పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లయ్యాక అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ కొండంత బాధను మనసులో దాచుకుని కుమిలిపోయిన శారదా చివరికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.