పెళ్ళైన మహిళతో స్నేహం చేస్తే.. చివరికి ప్రాణం పోయింది?
ఇక్కడ వివాహేతర సంబంధం మరో ప్రాణం పోవడానికి కారణమైంది.. మొన్నటి వరకు ప్రియుడి మోజులో పడిపోయి మహిళ భర్తను హత్య చేయడం లాంటి ఘటనలు మాత్రమే చూశాము. కానీ ఇక్కడ మాత్రం సదరు మహిళ భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన యాదగిరి జిల్లా లో వెలుగు చూసింది.. గురుమత్కాల్ తాలూకాలో పారిశ్రామికవాడలో సిద్ధార్థ అనే 30 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదగిరి తాలూకాకు సిద్ధార్థ బెంగళూరులో సొంతంగా రెండు కార్లను అద్దెకు తిప్పేవాడు.
ఈ క్రమంలోనే సిద్ధార్థకు శ్రీదేవి అనే 35 ఏళ్ల మహిళ తో పరిచయం ఏర్పడింది. సదరు మహిళకు పదేళ్ల క్రితమే నాగప్ప అనే వ్యక్తితో వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చారు ఈ దంపతులు. సిద్ధార్థ ఉంటున్న నివాసం పక్కనే వీరు కూడా ఇల్లు తీసుకుని ఉంటున్నారు. కాగా సిద్ధార్థ, శ్రీ దేవి ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే శ్రీదేవితో జల్సాల కోసం తన వద్ద ఉన్న కూడా కార్లు అమ్మేసి కుటుంబ బాధ్యతలను గాలికి వదిలేసాడు.
కాగా అతని వద్ద ఉన్న సొమ్మునంత లాగేసిన శ్రీదేవి మళ్లీ భర్తను ఆశ్రయించింది. దీంతో సిద్ధార్థ మళ్ళీ జీవనోపాధి కోసం బెంగుళూరు చేరాడు. అప్పుడప్పుడు శ్రీదేవిని కలవడానికి బెంగళూరు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు సిద్ధార్థ. మన బంధం గురించి భర్త కు అనుమానం వచ్చింది.. ఇకపై కలవడం కుదరదు అంటూ సిద్దార్దకు చెప్పింది శ్రీదేవి. కాగా సిద్ధార్థ జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ కుటుంబ సభ్యులు గమనించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మొన్నటికి మొన్న శ్రీదేవి ని కలవడానికి సిద్ధార్థ రావడంతో చివరికి భర్తతో కలిసి ప్రియుని దారుణంగా హత్య చేసింది. పోలీసు విచారణలో నిజాలు బయటపడ్డాయి.