మారుతీ సుజుకి: 17,362 కార్లు రీకాల్?

Purushottham Vinay
ప్రస్తుతం వస్తున్న అన్ని కార్లకు కూడా వాటి సెఫ్టీకి ఎయిర్ బ్యాగ్ సదుపాయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైన అనుకోని సందర్భంలో వారి కారు క్రాష్ అయినప్పుడు లోపల ఉండే ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో ఈ ఎయిర్ బాగ్స్ చాలా కీలకంగా వ్యవహరిస్తాయి.అన్ని కార్ల కంపెనీలు కూడా ఈ ఎయిర్ బ్యాగ్స్ పనితీరును చాలా డీప్ గా చేసాకే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. అయితే ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతీ సుజుకి కి సంబంధించిన కార్లలో ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ల సిస్టంలో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో ఆ కంపెనీకి చెందిన మొత్తం 17,362 యూనిట్లను వెనక్కి పిలిచింది.వాటిని చెక్ చేసి, మళ్లీ రీ ఫిట్ చేసేలా తన వినియోగదారులకు సమాచారాన్ని కూడా పంపింది.ఆ ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లను చెక్ చేసి, వాటిని అప్డేట్ చేసేందుకు మారుతి సుజుకి నుంచి ప్రత్యేకమైన ప్రకటన బుధవారం నాడు వెలువడింది.


ఆల్టో కే10, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా, ఎస్ ప్రెసో ఇంకా ఈకో, వంటి దాదాపు 17,362 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన మోడళ్లలో ఈ సమస్య తలెత్తినట్లు వివరించింది.ఇక ఆ కార్లలో తలెత్తిన సమస్యను ఫ్రీగా చెక్ చేసి, ఫిక్స్ చేస్తామని మారుతీ సుజుకి కంపెనీ తమ వినియోగదారులకు వివరణ ఇచ్చింది.ఇక కంట్రోలర్ సమస్యలతో ఉన్నమోడళ్లను చెక్ చేసి తిరిగి ఫిక్స్ చేసే దాకా బయట నడపవద్దని తమ వినియోగదారులను మారుతీ కంపెనీ కోరింది. ఎయిర్ బ్యాగ్ సమస్యతో బయటకు వెళ్తే అనుకోని విధంగా కారు క్రాష్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావని అందువల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చని కంపెనీ హెచ్చరించింది. వినియోగదారులు తమకు సమీపంలోని మారుతీ సుజుకి  వర్క్ షాపుల నుంచి సమాచారం వస్తుందని, అప్పుడు వెంటనే కారు ఆ సెంటర్ లో సరండెర్ చేయాలిన సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: