ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ శుభవార్త... గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం..!
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారీగా గ్రాట్యుటీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం కేవలం నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలలో నవోదయ విద్యాలయ సమితి ఒకటి. ఈ సమితిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం గ్రాట్యుటీని రెట్టింపు చేసింది.
గతంలో 10 లక్షల రూపాయలుగా ఉన్న గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం 20 లక్షల రూపాయలకు పెంచింది.
{{RelevantDataTitle}}