విశాఖ ఉక్కు.. మోడీ గుడ్ న్యూస్ చెప్పేస్తారా?
గతంలో కూడా విశాఖ ఉక్కు వ్యవహారం పై ఇచ్చిన వినతుల ఆధారంగా అధికారులతో.. చర్చలు జరిపినట్లు కుమార స్వామి చెప్పారని బిజెపి నేతలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు బీజేపీ ఎంపీలు చెప్పారు. అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు మాసాల్లో మరోమారు చర్చిద్దామని చెప్పినట్లు పేర్కొన్న బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.