హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్‌ ఉమెన్‌ ప్యాక్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ  బియ్యం సంచుల మీద ముద్రణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గమనించిన సిబ్బంది పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంటల దాటికి పరిశ్రమ ఒక వైపు కుప్పకూలింది. మిగతా భవనం కూడా బీటలు వారింది. దాదాపు 7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా కాలిపోయింది. సామాగ్రి, యంత్రాలు బుగ్గి పాలయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సిబ్బంది ముందుగానే బయటకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: