బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ పీఎం అయితేనే 6 గ్యారంటీలా?

Chakravarthi Kalyan
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే వాటిలో కొన్నింటినే అమలు చేస్తోంది. మిగిలినవి క్రమంగా అమలు చేస్తామంటోంది. అయితే.. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తేనే.. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే.. 6 గ్యారంటీలు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాడని.. 6 గ్యారంటీలు అమలు చేయలేమని రేవంత్ రెడ్డి చెప్పారని.. ఇది ప్రజలను మోసం చేయడమేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు.

ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్ కు సంబందించిన ఎన్నికలని గుర్తు చేసిన కిషన్ రెడ్డి.. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలన మోడీ 9 న్నర సంవత్సరాల పాలనపై ప్రజలకి వివరించాలన్నారు. కాంగ్రెస్ చరిత్రనే అవినీతి అని.. రేవంత్ రెడ్డి సీఎం కొత్తగా అయ్యారని విడిచిపెట్టాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: