జగన్‌కు వెల్‌కమ్‌.. బస్సుయాత్రపై కూటమి సెటైర్లు?

Chakravarthi Kalyan
బస్సు యాత్ర పేరుతో ఐదేళ్లలో మొదటిసారి ప్రజల్లోకి వస్తున్న జగన్ మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నామంటూ కూటమి నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. జగన్ బస్సు యాత్ర ప్రకటనపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.. ఐదేళ్లుగా ప్రజల కష్టాలు తెలుసుకోలేని జగన్ మోహన్ రెడ్ది ఎన్నికల కావడంతోనే బస్సు యాత్ర పేరుతో బయటకు వస్తున్నాడన్నారు. జగన్ మోహన్ రెడ్డికి త్రేట్ ఉందని సెక్యూరిటీ పెంచుతున్నట్టు డిజిపి మూడు నెలల క్రితం ప్రకటించారని.. జగన్ మోహన్ రెడ్డికి కుక్కలు పిల్లులు పందులు నుంచి త్రేట్ ఉందేమో అనిపిస్తుందని ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్‌ వేశారు.

మోడీ మూడు హెలికాప్టర్లలొ వస్తారు కాబట్టి  నేనేమి తక్కువ కాదు అని జగన్ మోహన్ రెడ్ది రెండు హెలికాప్టర్లు పెట్టుకున్నాడన్న ఆనం వెంకటరమణారెడ్డి.. త్రేట్ ఉన్న జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రను డీజీపీ ఎలా అనుమతిస్తారన్నారు. జగన్ మోహన్ రెడ్దికి త్రేట్ లేకపోతే గతంలో డిజిపి చెప్పిన మాటలు అబద్దమా.. హెలికాప్టర్ల పేరుతో ప్రభుత్వ ధనాన్ని జగన్మోహన్ రెడ్ది దుర్వినియోగం చేశాడని ఆనం వెంకటరమణారెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: