జగన్‌పై పోటీ చేస్తానంటున్న వివేకా హంతకుడు?

Chakravarthi Kalyan
వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఇప్పుడు వైఎస్‌ జగన్‌పైనే పోటీ చేస్తానంటున్నాడు. జై భీం రావు భారత్ పార్టీ తరపున దస్తగిరి పులివెందులలో పోటీ చేస్తానంటున్నాడు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా దళిత బిడ్డల పై దాడులు జరిగాయంటున్న దస్తగిరి.. వారి తరపున పూర్తి స్థాయి లో పోరాటం చేస్తానని.. జగన్ పాలన రాజు పాలన పోయి రాక్షస పాలన వచ్చినట్టుగా వుందని అంటున్నారు.


వాళ్ళు చేసిన అన్యాయాలను అక్రమాలను  మీడియా నే బయట పెడుతుందన్న దస్తగిరి.. జగన్ పూర్తి స్థాయి లో అమాయక ప్రజలు అందరినీ  మోసం చేసి మరోమారు గద్దె నెక్కాలని భావిస్తున్నారన్నారు. దళితులను కొట్టడం గొప్పదనమా అని ప్రశ్నించిన దస్తగిరి.. దళిత మహిళ ను రేప్ చేసి స్టేషన్ ముందు పడేసినా చర్యలు లేవని.. రాష్ట్రం లో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈ సారి జగన్ కు ఓట్ వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనంటున్న దస్తగిరి.. వివేక హత్య గురించి ఇప్పుడు మాట్లాడనంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: