గుడ్‌న్యూస్‌: ఇంకో రెండేళ్లు రూ.5కే భోజనం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో అమలవుతున్న ఐదు రూపాయల అన్నపూర్ణ భోజన పథకం మరో రెండేళ్లు నిరాటకంగా సాగనుంది. దీనికి సంబంధించి మరో రెండేళ్లపాటు హరే కృష్ణ మూమొంట్ చారిటబుల్ ఫౌండేషన్ తో ఒప్పందానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కమిషనర్ రోనాల్డ్ రాస్, స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిసి 17 అంశాలపై చర్చించి 16 అంశాలకు ఆమోదం తెలిపారు.
జీహెచ్ఎంసీలో రెగ్యులర్ సిబ్బందితోపాటు పొరుగు సేవల సిబ్బంది హాజరు పరిశీలనకు మొబైల ఆధారిత ముఖ గుర్తింపును అమలు చేయడానికి ఇ-ప్రొక్యూర్ మెంట్ టెండర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆర్సీ పురం రాయసముద్రం చెరువు మిషన్ కాకతీయలో కవర్ గాని ఇంటెక్-1 నుంచి ఇంటెక్ 2 వరకు డ్రైనేజీ మళ్లింపు పని కోసం 2 కోట్ల 52 లక్షల 30 వేలకు పరిపాలన మంజూరుతో టెండర్లు పిలవనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: