జగన్‌.. నీళ్లు అడిగితే.. కళ్లు పీకేస్తారా?

Chakravarthi Kalyan
వైసీపీ సర్కారు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అంటున్నారు. చిత్తూరు జిల్లాలో హంసవేణి చేతిపంపులో నీరు రావడంలేదని తెలుగుదేశం నాయకులకు చెప్పిందని.. వైకాపా వాళ్ళు ఆమెను పట్టుకొని రెండు కళ్ళు పీకేశారని
నారా భువనేశ్వరి మండిపడ్డారు. అమరావతి ఉద్యమంలో నిండు గర్భిణిని పోలీసులు బూతు కాలితో పొట్టమీద కొట్టారు...ఆ తల్లి కడుపులో బిడ్డను కోల్పోయిందని నారా భువనేశ్వరి అన్నారు.

తప్పు చేయని వ్యక్తిని జైలులో పెట్టారు...ఎప్పుడు చంద్రబాబు అవినీతి చేయలేదు, చేయరని నారా భువనేశ్వరి అన్నారు. అమరరాజా పరిశ్రమ చాలా ఏళ్లుగా ఇక్కడ పరిశ్రమ నిర్వహిస్తున్నారని.. అమరరాజ వాళ్ళు చాలా ఏళ్లుగా పన్నులు కడుతున్నారు...వారిని తరిమేశారని.. అన్నీ రాష్ట్రంలో తాకట్టు పెడుతున్నారు..చివరకు సచివాలయం కూడా తాకట్టుపెట్టారని నారా భువనేశ్వరి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి ఉంటుందన్న భువనేశ్వరి.. ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: