ఏం చేసుకుంటావో చేసుకో.. జగన్‌కు నారాయణ సవాల్‌?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ జగన్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సంస్థలపై సోదాలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ రైడ్స్ కి భ‌య‌ప‌డ‌ను.. ఎన్ని సార్లు చేస్తారో చేసుకోండి.. క‌ట్టక‌పోతే నోటీసులు ఇవ్వండి. లేక‌పోతే కోర్ట్ కి వెళ్లండి అంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. దాడులు, సోదాలు చేయ‌డం స‌రికాదన్న నారాయణ.. జ‌గ‌న్‌ది సైకో ప‌రిపాల‌న అని.. వ‌చ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు.



పెండింగ్‌లో వ‌ర్క్ ల‌న్నీ పూర్తి చేస్తానని.. నెల్లూరు న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని  నారాయణ అన్నారు. ఇది అరాచ‌క ప‌రిపాల‌న‌...ప్రజా ప‌రిపాల‌న కాదన్న నారాయణ .. అస‌లు ప్రజ‌ల అవ‌స‌రాలు తీర్చే ప్రభుత్వం కాదని.. కేవ‌లం ప్రజ‌ల్ని వేధించి వాళ్ల వైపు తిప్పుకోవాల‌న్నదే జగన్ ప్రయ‌త్నమని నారాయణ విమర్శించారు. ప్రజలు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని...పైకి భ‌య‌ప‌డిన‌ట్లు న‌టిస్తారని.. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు వాళ్ల ఓటు ఆయుధాన్ని చూపిస్తారని  నారాయణ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: