గొర్రెల కేసులో కీలక సమాచారం.. పెద్దల అరెస్టులు?
ప్రధాన నిందితుడు బినామీల బ్యాంక్ ఖాతాలను తన వ్యక్తిగత ఖాతాలకు నగదును బదిలీ చేసుకున్నాడని అధికారులు తేల్చారు. ఈకేసులో మరికొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జల్లా చెందిన పశుసంవర్ధక శాఖలో కొందరు అధికారులను బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు. అందులో ఇద్దరి అధికారులను మరోసారి విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.