ఏపీలో టీడీపీదే అధికారం.. ఇదే బలమైన సంకేతం?
ఈ దఫా ఆ కోణంలో చూస్తే టీడీపీకే గాలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. సాధారణంగా అధికార పార్టీలోకే చేరికలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే.. విపక్షం బలంగా ఉండి.. అధికారం మారుతుందని అనిపిస్తే విపక్షంలోకి చేరికలు బాగా ఉంటాయి. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. ఇటీవల తెలంగాణలోనూ ఇవే సంకేతాలు కనిపించాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు కనిపించాయి.