కులాల లెక్కలు తీస్తున్న రేవంత్.. శభాష్ బిడ్డా?
బీసీలు దశాబ్ధాలుగా ఇంటింటికి వెళ్లి తమ లెక్కలు తీసి జనాభా దామాషా మేరకు చట్టసభల్లో తమ వాటా కల్పించాలని చేస్తున్న డిమాండ్ ఇన్నాళ్ళకు నేరవేరబోతుందని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం అన్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో చేపట్టబోయే ఈ ”కుల సర్వే” త్వరితగతిన పూర్తి కావాలి... ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం సూచించారు. ఆ దిశగా బీసీల చిరకాల డిమాండ్లు అన్నీ క్రమంగా నెరవేరాలని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం ఆకాంక్షించారు.