అరబ్ దేశంలో హిందూ గుడి.. ఇవాళే మోడీ ప్రారంభం?
భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలోని ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం కథలు రూపొందించారు. అబుధాబీ మందిరంలో 402 స్తంభాలు ఏర్పాటు చేసి స్తంభాలపై దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ పింక్ స్టోన్స్, ఇటలీ పాలరాయి వినియోగించారు. అబుధాబీ మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లు వాడారు. వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండేలా అబుధాబీ ఆలయాన్ని నిర్మించారు.