మూసీ ప్రక్షాళన కోసం లండన్ ఎందుకు గుజరాత్ ఉందిగా?
15% ఉన్న మైనారిటీలకు రూ. 2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. 50% పైగా ఉన్న బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందంటున్నారు. బడ్జెట్లో వైద్య రంగానికి రూ. 11 వేల కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమలు చేస్తోందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎలా అమలు చేస్తారని నిలదీశారు.