షాకింగ్: రేవంత్ సర్కారు కూలబోతోందన్న విజయసాయి?
కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్కు అలవాటన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. దేశంలో అతి త్వరలో ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం లేపుతాయో?