కేసీఆర్ హయాంలో విద్యాకుంభకోణం కూడా?
గ్రామీణ ప్రాంతంలో 9, 10 తరగతి చదువుకున్న పేద విద్యార్థులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టారని.. దానిని అమలు కోసం థర్డ్ పార్టీకి చెందిన ఎంటీఎస్ సంస్థలకు ఇచ్చారని హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ అన్నారు. అందులో గుడిపూరిడి ప్రియాంక, అకుతోట సురేందర్ వీరితో పాటు సమగ్ర శిక్షా అధికారులైన రమేశ్, వెంటక నర్సమ్మ కుమ్మక్కయ్యారని.. సుమారు 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారని హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ ఆరోపించారు.