అక్కడ ఛీకొట్టారు.. షర్మిలపై రోజా ఫైరింగ్?
సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తోందని.. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా అన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరని రోజా అన్నారు.