మధ్యప్రదేశ్‌కు కవిత ఎందుకు వెళ్తోంది?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్ పర్యటించనున్నారు. మధ్య ప్రదేశ్ ఓబీసీ హక్కుల ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత హాజరువుతున్నారు. ఫ్రంట్ వ్యవస్థానకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే పీడిత్ అధికార్ యాత్ర”ను ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు. ఓబీసీ హక్కల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్ కు మద్ధతుగా ఎమ్మెల్సీ కవిత అక్కడి ప్రజానికాన్ని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కులు, డిమాండ్ల సాధన కోసం మధ్య ప్రదేశ్ లో దామోదర్ సింగ్ యాదవ్ పోరాటాన్ని సాగిస్తున్నారని కల్వకుంట్ల కవిత తెలిపారు.
మరోవైపు.. అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశంపై ఈ నెల 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత్ జాగృతి తెలిపింది. మాసబ్‌ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్ లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా కాంగ్రెస్, భాజపా,భారాసతోపాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులకు కవిత ఆహ్వానాలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: