సీమకు గుడ్న్యూస్: అవుకు టన్నెల్ జాతికి అంకితం?
గాలేరు –నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ప్రారంభించారు. ఈ డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది. అవుకు సొరంగాల పనులకు వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి పనులు చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు పనులు చేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రూ.145.86 కోట్లుతో టన్నెల్ 2 పనులను పూర్తి చేశారు.