దసరాకు ఊరెళ్తున్నారా.. గుడ్‌న్యూస్‌..?

Chakravarthi Kalyan
దసరా పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 621 సర్వీసులను నడిపించనుంది. పండుగ సెలవులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తీర్థయాత్రలు వెళ్లే వారికోసం కూడా పలు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ లో 208 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, జోన్ నుంచి 139 సర్వీసులను ఆపరేట్ చేస్తామని, మరో 141 సర్వీసులు జోన్ వరకు చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


ఇతర జోన్ లకు చెందిన మరో 133 ప్రత్యేక సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా వెళతాయి. మొత్తం 621 ప్రత్యేక సర్వీసులను దసరా పండుగ సందర్బంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచుతారు. సాధారణ సర్వీసులకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తారు. పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టికెట్ ధరలను పెంచుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: